మొన్న 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ స్టెప్పులిరగదీసిన ముద్దుగుమ్మ నభా నటేష్, ఇప్పుడు 'డిస్కోరాజా'తో చిందేస్తోంది. రవితేజ తాజా చిత్రం 'డిస్కోరాజా'లో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ చేతిలో పడ్డాక నభా నటేష్ వట్రంగా తయారైపోయింది. అది 'డిస్కోరాజా'కి బాగా కలిసొచ్చే అంశమే. అసలే అక్కడుంది మాస్ రాజా రవితేజ. చాక్లెట్ బోయ్ రామ్ పోతినేనితోనే ఆ రేంజ్లో మాస్ ఇరగదీసేస్తే ఇక 'డిస్కోరాజా' కోసం అదీ మన మాస్ రాజా కోసం అమ్మడు ఇంకెంత ఓపెన్ అప్ అయిపోయి ఉంటుందో నభా అని అంతా అనుకుంటున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా, ఒక్క సినిమా నభా నటేష్లోని అనూహ్యమైన యాంగిల్ని బయటికి తెచ్చేసింది. ఇంకేముంది..
ఆ యాంగిల్తో అమ్మడు టాలీవుడ్లో సెటిలైపోవడం ఖాయమే కొందరు ఫిక్సయిపోయారట. అయితే, ప్రస్తుతానికి మాత్రం నభా నటేష్ చేతిలో 'డిస్కోరాజా' సినిమా మాత్రమే ఉంది. కానీ, చాలా ఆఫర్లు వస్తున్నాయట. అయితే, వచ్చిన ఇమేజ్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, ఆచి తూచి కథల్ని ఎంపిక చేసుకోవాలని నభా నటేష్ భావిస్తోందట. అందుకే స్లో అండ్ స్డడీ నేచర్ ప్రదర్శిస్తోందట. ఇదిలా ఉంటే, 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నభా నటేష్కి సివియర్ హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదనీ, అది చాలా చిన్న హెల్త్ ప్రాబ్లెమ్ అనీ, దాని నుండి తేరుకుని, 'డిస్కోరాజా' షూటింగ్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నాననీ తాజాగా నభా పేర్కొంది.
|