రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'కి సంబంధించి ఫ్రెష్గా అందుతోన్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోందట. ఈ మధ్య చరణ్, ఎన్టీఆర్ గాయాల కారణంగా, షూటింగ్కి అనుకోకుండా లాంగ్ బ్రేక్ వచ్చేసింది. కానీ, ఆ గ్యాప్ని ఫిల్ చేసేందుకు షూటింగ్ని వేగవంతం చేశారట. కామ్గా షూటింగ్ లాగించేస్తున్నాడట జక్కన్న. ఇంతవరకూ ఎన్టీఆర్కి జోడీ దొరకలేదన్న చిన్నపాటి అనుమానం ఉంది. అయితే, తాజాగా ఆ డౌట్ కూడా తీరిపోయిందని తెలుస్తోంది. విదేశీ భామ ఎమ్మా రాబర్ట్స్ని, ఎన్టీఆర్ జోడీగా రాజమౌళి ఫైనల్ చేసేశాడట. కథ పరంగా ఆ పాత్ర కోసం విదేశీ భామనే కావాలని పట్టు పట్టిన రాజమౌళి మొత్తానికి విదేశీ భామని పట్టేశాడు. త్వరలోనే ఈ విదేశీ భామ షూటింగ్లో జాయిన్ అవనుందనీ తెలుస్తోంది. ఓ ప్రెస్ మీట్ పెట్టి, జక్కన్న ఈ విషయమై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట.
మరోవైపు రామ్ చరణ్ 'సైరా' సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. అయినా కానీ, 'ఆర్ఆర్ఆర్' షూటింగ్కి ఎలాంటి బ్రేక్ రాకుండా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. ఎన్టీఆర్ అయితే, పూర్తిగా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్కే పరిమితమైపోయాడు. హైద్రాబాద్ శివార్లలో వేసిన ఓ భారీ సెట్లో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ సైలెంట్గా జరిగిపోతోందట. ఎలాగైనా అనౌన్స్ చేసిన డేట్ (2020 జూలై 30) మిస్ కాకుండా, ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న కసితో ఉన్నాడట జక్కన్న. కీరవాణి ఈ సినిమాకి బాణీలు అందిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, చరణ్కి జోడీగా నటిస్తోంది. డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
|