గత 11 వారాలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిగ్బాస్ సీజన్ 3 ప్రీ క్లైమాక్స్కి చేరుకుంది. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. 16 మంది కంటెస్టెంట్స్తో స్టార్ట్ అయిన ఈ రియాల్టీ షో, ఎలిమినేషన్స్ అనంతరం 9 మంది కంటెస్టెంట్స్తో రన్ అవుతోంది ప్రస్తుతం. మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో అలీ రెజాకి రీ ఎంట్రీ ఛాన్స్ దక్కింది. చివరిదశకు చేరుకోవడంతో, టాస్క్లు క్రిటికల్గా సాగుతున్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా విచిత్రంగా జరుగుతోంది. తాజా ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి, 'రాళ్లే రత్నాలు' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ టాస్క్లో ఎక్కువ రాళ్లు వెనకేసుకున్న వారు సేఫ్ జోన్లోకి వెళ్లగా, తక్కువ రాళ్లు సంపాదించినవారు నామినేట్ అయ్యారు. ఆ లిస్టులో వరుణ్, రాహుల్, పునర్నవి, మహేష్ జమ అయ్యారు.
ఈ నలుగురూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. వీరిలోంచి ఈ వారం ఎవర్ని బయటికి పంపిస్తాడు బిగ్బాస్ అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే, ఈ వారం అప్డేట్స్ విషయానికొస్తే, హౌస్మేట్స్ సహాయ, ప్రోత్సాహకాలతో శ్రీముఖి ఇంటి కెప్టెన్ అయ్యింది. అసలే డామినేషన్ అయిన రాములమ్మ కెప్టెన్గా తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ వారం బిగ్బాస్ షోకి 'సైరా' నుండి ఓ గెస్ట్ని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. ఆ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చిరంజీవి నటించిన 'సైరా' ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకున్న సందర్భంగా, హోస్ట్ నాగార్జునకు చిరంజీవి మంచి స్నేహితుడైన కారణంగా ఆయన్ని ఈ షోకి గెస్ట్గా తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి.
|