మారుతి సినిమాల్లో సహజంగానే పల్లెటూరి వాతావరణం చక్కగా ప్రతిబింబిస్తూంటుంది. ఆయన తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో 'ప్రతీరోజూ పండగే' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలోనూ అదే ఆహ్లాదాన్ని ప్రతిబింబించనున్నాడు. అందుకోసం గోదావరి జిల్లాల్లో మకాం వేసింది గత కొన్ని రోజులుగా 'ప్రతీరోజూ పండగే' టీమ్. ఈ క్రమంలో గోదారి జిల్లాల లొకేషన్స్ని తాను ఎంజాయ్ చేయడమే కాకుండా, అక్కడి అందాల్ని తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేసి, ఫ్యాన్స్కీ కన్నుల పండగ అందించాడు. ఇక సినిమా విషయానికి వస్తే, దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
దీపావళికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ ఏడాది ఆల్రెడీ 'చిత్రలహరి' సినిమాతో ఓ హిట్ని తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్కి 'ప్రతీరోజూ పండగే' కూడా మంచి విజయం అందించనుందనిపిస్తోంది. 'చిత్రలహరి'లో తేజ్లోని జోష్ కొంచెం తగ్గిందనే టాక్ వినిపించింది. ఆ లోటు ఇప్పుడీ సినిమాతో తీరిపోనుందట. తన మార్క్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు మారుతి. యూవీ క్రియేషన్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.
|