మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రంలో ఇస్మార్ట్ గాళ్ నభా నటేష్ హీరోయిన్గా ఎంపికైంది. 'ఇస్మార్ట్ శంకర్'తో బంపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్కి తేజు సినిమాతో మెగా కాంపౌండ్ని టచ్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతోందట. మెగా కాంపౌండ్ అంటే మాటలు కాదు. మెగా కాంపౌండ్ అంటే, ఒక్క ఛాన్స్ లెక్క కిందికి రాదు. అదృష్టం బావుంటే, ఏకంగా మెగాస్టార్తో కాకున్నా, ఆయన సినిమాలో చిన్న క్యారెక్టర్లోనైనా నటించే ఛాన్స్ అయినా దక్కించుకోవడం పక్కా అనడం అతిశయోక్తి కాదేమో. టాలీవుడ్లో ఉన్న హీరోయిన్స్ కొరత అలాంటిది.
ఏమాత్రం లక్ కలిసొచ్చినా, ముద్దుగుమ్మల పంట అలా పండిపోతుంది మరి. ఇంతకీ తేజు నటిస్తున్న ఆ కొత్త చిత్రం కథా కమామిషు ఏంటంటే, సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాలో పరిచయమవుతున్నాడు. 'సోలో లైఫే సో బెటర్' అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ జరగనుంది. ప్రస్తుతం తేజు మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తేజు సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. క్రిస్మస్కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
|