దర్శకుడిగా వినాయక్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే, ఈ మధ్య వరుస ప్లాఫ్లతో సతమతమవుతున్న వినాయక్కి బాస్ చిరంజీవి రూపంలో 'ఖైదీ నెంబర్ 150' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. డైరెక్టర్గా వినాయక్ని బొత్తిగా పట్టించుకోవడం మానేశారు జనం. దాంతో అవతారం మార్చేశాడు వినాయక్. డైరెక్టర్ నుండి హీరోగా మారిపోయాడు. దిల్ రాజు నిర్మాణంలో వినాయక్ హీరోగా 'శీనయ్య' అనే సినిమా రూపొందుతోంది. నరసింహా ఈ సినిమాకి దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్పై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.
విగ్ మోహన్బాబులా ఉందనీ, ముఖం చిరంజీవిని తలపిస్తోందనీ, మెడలోని ఎర్ర తువాలు పవన్ కళ్యాణ్ స్టైల్నీ, చేతిలో రెంచి పట్టుకుని నడిచొస్తున్న వైనం ఎన్టీఆర్నీ తలపిస్తోందని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఏ యాంగిల్లోనూ వినాయక్ కనిపించడం లేదన్న మాట. అంటే, పూర్తిగా హీరో లుక్స్లోకి మారిపోయిన వినాయక్నే నెటిజన్స్ చూస్తున్నారన్న మాట. అంటే, ఫస్ట్లుక్తోనే హీరోగా వినాయక్ సక్సెస్ అయిపోయాడు. ఇక 'శీనయ్య'గా వినాయక్ ఎన్ని మార్కులు స్కోర్ చేస్తాడనేదే చూడాలి. 'మరక మంచిదే' అన్నట్లుగా, అప్పుడప్పుడూ ట్రోలింగ్ కూడా మంచిదే. వినాయక్ విషయంలో అది ప్రూవ్ అవుతోంది బాస్.
|