మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా నభా నటేష్ని ఎంచుకున్నారట. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె ప్లేస్ని నిధి అగర్వాల్ రీ ప్లేస్ చేసిందనీ తెలుస్తోంది. నిజానికి గల్లా అశోక్ డెబ్యూ ఎప్పటి నుండో అనుకున్నదే. ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. అప్పుడెప్పుడో 'అదుగో', 'నన్ను దోచుకుందువటే' టైమ్లోనే నభా నటేష్ని ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారట. ఏం జరిగిందో ఏమో కానీ, ఆ ప్లేస్లోకి తాజాగా నిధి అగర్వాల్ వచ్చి చేరింది. అనుకోకుండా తెరపైకి వచ్చిన ఈ న్యూస్ ఫ్యాన్స్లో ఆసక్తికి కారణమైంది. ఈ సిట్యువేషన్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాని తలపిస్తోందంటూ, కథలల్లేస్తున్నారు. అవును..
శంకర్ జీవితంలోకి ముందుగా చాందిని రూపంలో నభా నటేష్ వస్తుంది. ఆ తర్వాత నిధి అగర్వాల్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు అశోక్ గల్లా సినిమా విషయంలోనూ జరిగిందంటున్నారు. ఏది ఏమైతేనేం, నభా నటేష్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే 'డిస్కోరాజా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా మేనల్లుడు తేజుతో ఓ సినిమాకి కమిట్ అయ్యింది. మరిన్ని ప్రాజెక్టులు ఈ ఇస్మార్ట్ గాళ్ చేతిలో ఉన్నాయి. కానీ, 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి అగర్వాల్ చేతికి చిక్కిన తెలుగు ప్రాజెక్ట్ మాత్రం ఇదే.
|