స్టార్ హీరోలతో వివిధ బ్రాండ్స్కి అదనపు గ్లామర్ వచ్చేస్తోంది. జ్యుయెలరీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలంటే మహిళలకే ప్రాధాన్యత ఒకప్పుడు. కానీ ఇప్పుడు నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ తదితర స్టార్లు కూడా జ్యుయెలరీ ప్రకటనల్లో కన్పించడం జరుగుతోంది. కళ్యాణ్ జ్యుయెలర్స్కి బ్రాండ్ అంబాసిడర్ అయిన నాగార్జున, ఆ ప్రకటనల్లో తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన కొన్ని ప్రకటనలు హృదయానికి హత్తుకునేలా వుండగా, కొత్తగా వస్తోన్న ప్రకటన గుండె లోతుల్ని స్పృశిస్తోంది. కారణం, ఆ ప్రకటనలో నాగార్జున తండ్రిగా అమితాబ్ కన్పించడం. ‘నమ్మకం’ అనే అంశం చుట్టూ ఈ ప్రకటన అద్భుతంగా రూపుదిద్దుకుంది. నాగార్జున స్టార్ డమ్, అమితాబ్కి వున్న క్రేజ్తో ఈ ప్రకటన సూపర్ హిట్ అయ్యిందంటున్నారు.
వెండితెరపై కూడా ఈ కాంబినేషన్ చూడాలని తెలుగు ప్రేక్షకులు కోరుకోవడంలో తప్పేమీ లేదు. ప్రకటన ఇంతపెద్ద హిట్ అయినప్పుడు, తెరపై నాగ్, అమితాబ్ హీరోలుగా కన్పిస్తే, ఆ కాంబినేషన్ ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో కదా.
|