వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన కళామందిర్ సంస్థ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడల్లో అందమైన సుందరాంగుల కోసం పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కాకినాడ, రాజమండ్రి నగరాలకు చెందిన యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజమండ్రిలో జరిగిన పోటీల్లో 85 మంది యువతులు, మహిళలు ఈ పోటీల్లో పాల్గొనగా, సినీ గీత రచయిత సిరాశ్రీ, నటి నీలిమా నాయుడు, శ్రీకాకుళపు మీనాక్షి, రాజమండ్రి అర్బన్ ఎస్పీ సతీమణి రమాదేవి, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కళామందిర్ సీఈఓ కళ్యాణ్ దంపతుల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.
కందుకూరి వీరేశలింగం ప్రవేశపెట్టిన సంస్కరణల గురించీ, సౌందర్యం గురించీ, అమ్మ గురించీ పోటీదారుల్ని పలు ప్రశ్నలు అడిగిన న్యాయ నిర్ణేతలు వారిచ్చిన సమాధానం ఆధారంగా విజేతల్ని ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొనడం పట్ల విజేతలు, పోటీల్లో పాల్గొన్న మిగతావారూ సంతోషం వ్యక్తం చేశారు.
కాకినాడలోనూ ఇదే తరహాలో పోటీలు జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరిగిన ఈ పోటీలు మహిళల్లో అందం పట్ల అవగాహన పెంచడంతోపాటు, సామాజిక స్పృహ మరింతగా వారిలో పెంచిందనీ, దాంతోపాటుగా మానసికోల్లాసం కూడా వారిలో పెరుగుతుందనీ పోటీదారులు, నిర్వాహకులు చెప్పారు.
|