అంధులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారం కోసం అంధులు చేసే పోరాటం కథాంశంగా ఎంచుకుని ‘మిణుగురులు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా నిర్మాణం జరుపుకుంది కొన్ని నెలల క్రితమే. ఈ సినిమా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు కూడా. వారంతా సినిమాపై ప్రశంసలు గుప్పించారు. అద్భుతమైన కథ, దర్శకుడు సినిమాని అద్భుతంగా రూపొందించాడని కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ప్రశంసించడం జరిగింది.
అలా విడుదలకు ముందు ప్రశంసలు అందుకున్న ‘మిణుగురులు’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచి మంచి ఆదరణ లభిస్తోన్నది. సినిమా చూసినవారంతా ఇన్స్పయిరింగ్గా వుందని ప్రశంసిస్తున్నారు, దర్శకుడు అయోధ్యకుమార్ , రచయిత మహేష్ కత్తి ప్రయత్నానికి అభినందనలు తెలుపుతున్నారు.
మొదట దీన్ని ఓ ఆర్ట్ ఫిలింగా అందరూ చూసినప్పటికీ, అలాంటి సినిమాల్ని మాత్రమే ఇష్టపడేవారికే కాకుండా, మామూలు ప్రేక్షకులకూ సినిమా నచ్చుతోంది. మంచి కాన్సెప్ట్తో, ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమా తీయగలిగితే అది అందరి మన్ననలూ అందుకుంటుందని ‘మిణుగురులు’ నిరూపించింది.
ప్రేక్షకుల మెప్పు కూడా పొందుతున్న ‘మిణుగురులు’ సినిమాకి అవార్డులూ ఖాయంగా కనిపిస్తోంది.
|