అందాల సుందరి ఐశ్వర్యారాయ్ దక్షిణాది సినిమాలతోనే కెరీర్ ప్రారంభించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్’ నటిగా ఆమెకు తొలి సినిమా. ఇప్పుడామె సినిమాల్లో నటించడంలేదు. ఆరాధ్యకు జన్మనిచ్చిన ఐశ్వర్యారాయ్, ఆరాధ్య ఇప్పుడు కాస్త పెద్దదవడంతో సినిమాలపై దృష్టిపెట్టింది.
ఐశ్వర్యారాయ్ రీ`ఎంట్రీ కూడా దక్షిణాది సినిమాలతోనే ఇస్తుందని ఓ టాక్ నడుస్తోంది. మణిరత్నం ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట. మణిరత్నం సినిమాతోనే తెరంగేట్రం చేసిన ఐష్, మణిరత్నం సినిమాతోనే రీ`ఎంట్రీ ఇస్తోందనంటే అది ఆసక్తిరమైన విషయం కాకుండా ఎలా ఉంటుంది?
మణిరత్నం తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాగార్జున, మహేష్, టబు నటిస్తారని, ఇది బై లింగ్వుల్ సినిమా అని ప్రచారంలో ఉంది. అయితే నాగ్, మహేష్ ఈ సినిమాలో నటించడంపై ఎలాంటి అధికారిక వార్తా లేదు, అది ఇంకా ఊహాగానాలకే పరిమితమై ఉంది. ఐశ్వర్యారాయ్ మాత్రం ఈ సినిమాలో నటించడం ఖాయమట.
|