Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anamika

ఈ సంచికలో >> సినిమా >>

దక్షిణాదిలో రెండో విడత

second innings

అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌ దక్షిణాది సినిమాలతోనే కెరీర్‌ ప్రారంభించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్‌’ నటిగా ఆమెకు తొలి సినిమా. ఇప్పుడామె సినిమాల్లో నటించడంలేదు. ఆరాధ్యకు జన్మనిచ్చిన ఐశ్వర్యారాయ్‌, ఆరాధ్య ఇప్పుడు కాస్త పెద్దదవడంతో సినిమాలపై దృష్టిపెట్టింది.

ఐశ్వర్యారాయ్‌ రీ`ఎంట్రీ కూడా దక్షిణాది సినిమాలతోనే ఇస్తుందని ఓ టాక్‌ నడుస్తోంది. మణిరత్నం ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట. మణిరత్నం సినిమాతోనే తెరంగేట్రం చేసిన ఐష్‌, మణిరత్నం సినిమాతోనే రీ`ఎంట్రీ ఇస్తోందనంటే అది ఆసక్తిరమైన విషయం కాకుండా ఎలా ఉంటుంది?

మణిరత్నం తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాగార్జున, మహేష్‌, టబు నటిస్తారని, ఇది బై లింగ్వుల్‌ సినిమా అని ప్రచారంలో ఉంది. అయితే నాగ్‌, మహేష్‌ ఈ సినిమాలో నటించడంపై ఎలాంటి అధికారిక వార్తా లేదు, అది ఇంకా ఊహాగానాలకే పరిమితమై ఉంది. ఐశ్వర్యారాయ్‌ మాత్రం ఈ సినిమాలో నటించడం ఖాయమట.

 

మరిన్ని సినిమా కబుర్లు
red carpet