పవన్ కళ్యాణ్ విడుదల చేసిన "ఇజం" పుస్తకం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. అయితే పుస్తకం చదివి కాదు. అది ఇంగ్లీషులో ఉండడం వల్ల. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, వివిధ పాత్రికేయులు, సామాన్య ప్రజానీకం ఈ పుస్తకాన్ని తెలుగులో చూడాలనుకుంటున్నారు. దీనికి తోడు రాం గోపాల్ వర్మ ఈ పుస్తకం పై ట్విట్టర్లో ఇచ్చిన స్పందన కొత్త వివాదానికి తెరలేపింది. ఈ పుస్తకాన్ని పవన్ అభిమతంగా రాసిన రాజు రవి తేజ కళ్యాణ్ ని పూర్తిగా వక్రమార్గం పట్టించారని, అసలు ఆ పుస్తకం ఆ రాసినతనికైనా అర్థమయ్యుంటుందా అని వ్యాఖ్యలు చేసారు. పనిలో పనిగా జనానికి అర్థం కాని కొన్ని పాశ్చాత్య సిధ్ధాంతాలని కూడా ట్విట్టర్లో ప్రస్తావించారు. ఏది ఏమైనా వర్మ ట్వీట్లు ఈ పుస్తకం ప్రచారానికి ఉపయోగపడ్డాయనుకోవాలి.
|