అక్కినేని నాగేశ్వరరావు గారు తాను నటించిన చిత్రాల్లో చూడని ఏకైక చిత్రం త్వరలో రాబోయే "మనం". తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నటన, డబ్బింగ్ అన్నీ త్వరత్వరగా ముగించేసి సినిమా పూర్తవ్వడానికి తోడ్పడిన కమిటెడ్ నటుడు అక్కినేని.
ఎడిటింగ్, నెపధ్య సంగీతం వగైరాలన్నీ పూర్తి చేసుకుని ఈ వారం ట్రైలెర్ విడుదల చేసుకుంది ఈ చిత్రం. ప్రారంభంలో వినిపించే అక్కినేని నాగేశ్వరరావు గారి మాటలు నీరసంగా ఆయన సహజ శైలికి దూరంగా అనిపించినా, మిగిలిన సీన్స్ లో గంభీరంగానే ఉన్నాయి. ఈ సినిమాకి ఏకైక ఎసెట్ ఏయన్నార్ అని వేరే చెప్పక్కర్లేదు.
ట్రైలర్ చూసిన వాళ్లలో చాలామంది కంటతడి పెడుతున్న మాట కూడా వాస్తవం. మే 23న రాబోయే ఈ సినిమాను ప్రేక్షకులంతా సూపర్ హిట్ చేసి ఏయన్నార్ కు నిజమైన వీడ్కోలు అందిస్తారని ఆశిద్దాం.
|