గోతెలుగు డాట్ కాం సమర్పిస్తున్న "లేడీస్ అండ్ జెంటిల్మెన్" కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. చూస్తుంటేనే అర్థమవుతోందిగా... ఇందులో కొత్తదనం ఏమిటో. వంటింట్లొ ల్యాప్ టాప్ ని పొయ్యి మీద పెట్టి వండుతున్న ఒక జంతుముఖంలో ఉన్న స్త్రీ. అంతా బాగానే ఉంది కాని ఆ జంతుముఖం ఎందుకని మీకు సందేహం రావొచ్చు. రాను రాను మనుషుల్లో మనిషితనం పోయి జంతువులాంటి ఆలోచనలు పెరుగుతున్నాయనే విషయాన్ని ఇలా అధివాస్తవిక పధ్ధతిలో చెప్పారన్నమాట.
సోషల్ మీడియా వల్ల జరిగే లాభనష్టాల విషయాల సమాహారంగా సాగే ఈ చిత్రం ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేదిగా ఉంటుందని, ముఖ్యంగా యువతను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుందని విశ్లేషకుల అభిప్రాయం.
మంజునాథ్ దర్శకత్వంలో షిర్డీ సాయి బ్యానర్ మీద, మధురా శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ చిత్రం మేలో విడుదలవుతుంది.
|