నిఖిల్, స్వాతి జంటగా సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన "స్వామి రారా" చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిదే. ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు సీక్వెల్ రాబోతోంది.
"స్వామి స్వామి రారా" టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి "ది సాగా కంటిన్యూస్" అనేది ఉపశీర్షిక. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని "స్వామి రారా" చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మినరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై."స్వామి స్వామి రారా" చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
ఈ సంధర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ "నవ్యతతో కూడిన కథాంశం తో సినిమాలు రూపొందిస్తే ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక ఉంటుందని "స్వామి రారా" చిత్రంలో మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ను నిర్మించబోతున్నాం. ఓ ప్రముఖ కథానాయకుడు నటించనున్న ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా, హై బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించుతున్నాం. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.యస్.వర్మ.
|