Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bacchan platinum function on may 17th

ఈ సంచికలో >> సినిమా >>

ఓ మనిషి కథ షూటింగ్ పూర్తి

completed o manishi katha shoooting

ఓం శివ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ సీనియర్ దర్శకులు  రాధాస్వామి  ఆవుల తెరకెక్కిస్తున్న  చిత్రం "ఓమనిషి కథ". జగపతి బాబు, కళ్యాణి  జంటగా నటిస్తున్నారు. బాలా భాయ్  చో వాటియా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని  .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. " ఒకే సంఘటనపై ముగ్గురు వ్యక్తుల ప్రతిస్పందన" నేపధ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్  మరియు టీజర్ ను త్వరలో చేయనున్నారు.

ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత బాలా భాయ్  చో వాటియ మాట్లాడుతూ... "మా చిత్ర దర్శకులు  రాధా స్వామి  ఆవుల చాలా సీనియర్ టెక్నీషియన్. మరాఠీలో పది చిత్రాలను రూపొందించగా.. అందులో నాలుగు చిత్రాలు సిల్వర్ జూబ్లీగా నిలిచాయి. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ  నుంచి "రికార్డిస్ట్" గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న రాధా స్వామి  గారూ.. 1985 లో తొలి హిందీ త్రీడీ చితంగా తెరకెక్కిన "శివా కా ఇన్సాఫ్"  చిత్రానికిగాను "బెస్ట్ సౌండ్ రికార్డింగ్" అవార్డ్ సొంతం చేసుకున్నారు. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగిన రాధా స్వామి గారితో "ఓ మనిషి కథ" వంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా వుంది. " అన్నారు.

చిత్ర దర్శకులు   రాధా స్వామి మాట్లాడుతూ .. "తెలుగులో "బెస్ట్ ఫెయిర్ గా" అందరి మన్ననలు అందుకున్న జగపతి బాబు, కళ్యాణిలను   మరో సారి ప్రేమికులుగా చూపించడం  చాలా సంతోషంగా వుంది. ఒక మంచి ప్రేమ కథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. జగపతి  బాబు పాత్ర చిత్రీకరణ, కల్యాణి నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. త్వరలో ఓ మనిషి కథ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అన్నారు.

కొండవలస, సుమన్ శెట్టి, రవి, అస్మిత ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కురాకుల, పాటలు: సుద్దాల అశోక్ తేజ, మాటలు: ఆది గణేశ్, కూర్పు: కె. వెంకటేశ్వర్ లు, ఛాయా గ్రహణం : జి.రంగనాథ్, నిర్మాత: బాలా భాయ్ చో వాటియ, కథ- చిత్రానువాదం- దర్శకత్వం : రాధాస్వామీ ఆవుల!

మరిన్ని సినిమా కబుర్లు
boom boom in thailand