కావలిసిన పదార్ధాలు:
టమాట ముక్కలు
ఎండుమిర్చి
పోపుదినుసులు
కొత్తిమీర
కరివేపాకు
వెల్లుల్లి పాయలు
నూనె
ఉప్పు
తయారుచేయు విధానం:
ముందుగా బాణాలిలో నూనె వేసి అది కాగాక ఎండు మిర్చి వేయాలి. అవి కొంచం ఎర్రగా వేగాక అవి తీసి టమాట ముక్కలు వేసి 10 నిమిషాలు మగ్గనివాలి. తరువాత కొత్తిమీరవేసి కలిపాలి. రోటిలో ముందుగా ఎండుమిర్చిని గింజలు మెదిగేవరకు మెత్తగా నూరాలి. తరువాత ఉడికిన టమాట ముక్కల మిశ్రమాన్ని వేసి నూరాలి. నూరిన ఈ పచ్చడిలో ఉప్పు వేసి పోపు పెట్టాలి. భాణాలిలో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.
ఈ రోటి పచ్చడి రాయలసీమ ప్రత్యేక పచ్చడిగా చెప్పవచ్చు
|