రాం గోపాల్ వర్మ తీసిన సత్య-2 చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన ఆరాధన గుప్తాకి ఒక పౌరాణిక పాత్ర దొరికింది.
రవి పనస నిర్మాణంలో రవి పనస ఫిల్మ్ కార్పోరేషన్ పతాకంపై కో వె ర దర్శకత్వంలో రూపొందుతున్న "నల దమయంతి" చిత్రంలో దమయంతి పాత్రకు గాను ఆరాధన గుప్తా ఎంపికయ్యింది. ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పకులు. ఆడిషన్స్ లో పలువురు నటీమణులను పరీక్షించి చివరగా ఆరాధనను ఫైనలైజ్ చేసారు.
డైరెక్ట్ తెలుగులో ఆరాధనకి ఇది తొలిచిత్రమనే చెప్పాలి. తనకి ఈ పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, పూర్తి న్యాయం చేసేలా నటిస్తానని చెప్పింది. ఈ చిత్రం ప్రస్తుతం ఒక షెడ్యూలు పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూలు మరో నెల పాటు హైదరాబాద్ పరిసరాల్లో చేసిన తర్వాత యూనిట్ కేరళ వెళ్తుందట.
|