రామ్ చరణ్ వరుసగా మాస్ సినిమాలు చేస్తుండడంతో, కొంచెం రొటీన్ కి భిన్నమైన సినిమాలు కూడా చేస్తే బాగుండునని ‘ఎవడు’ సినిమా తరువాత సినిమా వర్గాలు అనుకోవడం జరిగింది. అందుకనే రామ్ చరణ్ కూడా వెరైటీ సబ్జెక్ట్ ల కోసం అన్వేషించి, చివరకు ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమాకి కమిట్ అయ్యాడట. కృష్ణవంశీ దర్శకుడు ఈ చిత్రానికి. విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట ఈ క్రియేటివ్ డైరెక్టర్ .
ఎవరూ ఊహించని కథాంశంతో ఈ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా రూపొందుతోందట. సినిమా స్టిల్స్ లో కూడా రామ్ చరణ్ కొత్తగా కనిపిస్తున్నాడు. చిరంజీవితో సినిమా తీయాలని అనుకుని, ఆ అవకాశం రాక నిరాశపడ్డ కృష్ణవంశీ, చిరంజీవి కుమారుడితో చేస్తున్న సినిమాని గొప్ప విజయవంతమైన చిత్రంగానే కాక, వెరైటీ చిత్రంగానూ మలచి తన సత్తా చాటుకోవాలనుకుంటున్నాడట.
సినిమాపై ఎన్ని రకాలైన ఊహాగానాలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా దర్శకుడు కృష్ణవంశీ, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని ఓ యజ్ఞంగా రూపొందిస్తున్నట్లుగా సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రామ్ చరణ్ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ప్రూవ్ చేసుకోవడంతో వెరైటీ చిత్రంగానే కాక వసూళ్ళ పరంగా కూడా సినిమా గొప్ప విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
|