నితిన్ హీరోగా వచ్చిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో ఇషా తల్వార్ ఓ హీరోయిన్గా నటించింది. మెయిన్ హీరోయిన్గా నిత్యామీనన్ నటించగా, ఇషా తల్వార్ కూడా తన నటనతో, అందచందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిందీ అందాల భామ.
ఏ భాషలో కంఫర్టబుల్గా వుంటుందని ప్రశ్నిస్తే, తెలుగు సినిమా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పింది. మలయాళంలో స్క్రిప్ట్ని నమ్ముతారనీ, తమిళ ` తెలుగు సినిమాల్లో కమర్షియల్ యాంగిల్ ఎక్కువనీ, హిందీ సినిమాల నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగదని, కానీ వాటి ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులెక్కువని ఇషా తల్వార్ అభిప్రాయపడిరది.
కమర్షియల్ ఆలోచనలు చేస్తూనే, టెక్నికల్ అంశాలకు ప్రాధాన్యతనిచ్చే తెలుగు సినిమా అంటే ఇషా తల్వార్కి అమితమైన ఇష్టమట. మిగతా భాషల సినిమాలతో పోల్చితే తెలుగు సినిమాలు కలర్ఫుల్గా వుంటాయని, పరిశ్రమ కూడా కలర్ఫుల్గా ఉంటుందని ఇషా తల్వార్ వెల్లడిరచింది. ‘మైనే ప్యార్ కియా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోమారు రానుంది ఇషా తల్వార్
|