తెలుగు సినిమా పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ చాలా అరుదు. అలనాటి తార విజయనిర్మల తర్వాత దర్శకురాలు జయ తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకురాలిగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలో ఇంకొందరు లేడీ డైరెక్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవడం అభినందనీయం. ‘అలామొదలైంది’ సినిమాతో నందినిరెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసినదే కదా.
అయితే పాటల రచయితల్లో అతి అరుదుగానే మహిళలు దర్శనమిస్తారు. అలా అరుదుగా వచ్చిన ఓ లేడీ లిరిసిస్ట్ పేరు రమాదేవి. ‘పోకిరి రాజా..’ అంటూ సాగే పాటను రచించారీమె. తొలి పాటతోనే తెలుగు సినీ సంగీతాభిమానుల్ని ఆకట్టుకున్నారు రమాదేవి. ఈ పాటకి మంచి స్పందన లభిస్తోంది.
నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ‘మాయ’ సినిమా విడుదల కాక ముందే ఈ సినిమా పాట ద్వారా ఆమె పేరు సినిమా పరిశ్రమలో మార్మోగిపోతోంది. తెలుగు సినీ పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన రమాదేవి ముందు ముందు మరిన్ని అవకాశాలు దక్కించుకుని, లేడీ లిరిక్ రైటర్గా తన ప్రత్యేకతను చాటుకోవాలని ఆశిద్దాం
|