'ఈ రోజుల్లో ' చిత్రం లో సంచలనం సృష్టించిన ప్రముఖ సౌత్ ఫిల్మ్ ప్రమోషనల్ ఏజెన్సీ శ్రేయాస్ మీడియా... మరోమారు అదే రేంజ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో యువతను అలరించనున్నారు. నూతన నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ వారు రూపొందిస్తున్న తాజా చిత్రం "YES" శ్రేయాస్ మీడియా సమర్పణలో దేవాస్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రజని తనయ్ దర్శకత్వం లో శ్రీనివాస్, శ్యాం సం యుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ ఈ మధ్యనే పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం త్వరలో బ్యాంకాక్ వెళ్ళనున్నారు. అక్కడ పది రోజుల పాటు నిరవధికంగా పాటల చిత్రీకరణను పూర్తి చేసి.. జూలై మూడో వారం లో ఆడియోను, ఆగష్టు చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు!
|