సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి సినిమాలకు చాలాకాలం నుంచి దూరంగా ఉన్నారు. తెలుగు తెరపై మెగాస్టార్గా మళ్ళీ వెలగాలనుకుంటున్న చిరంజీవి, కొన్ని కథలు కూడా విన్నారు ఇప్పటికే. కాని ఏ కథ కూడా ఆయన్ను థ్రిల్ చేయలేదంట. అక్కినేని ఫ్యామిలీ నటించగా వచ్చిన ‘మనం’, వెంకటేష్ హీరోగా చేసిన ‘దృశ్యం’ సినిమాలకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు రావడంతో, అలాంటి సినిమా చేయాలని చిరంజీవి ఉవ్విళ్ళూరుతున్నారట.
కాని చిరంజీవికి ఒకప్పుడు ఉన్న స్టార్డమ్ని దృష్టిలోపెట్టుకుని ‘ఠాగూర్’, ‘స్టాలిన్’ లాంటి కథలనే ఆయనకు వివరిస్తున్నారు ఔత్సాహికులు. అవన్నీ పక్కన పెట్టి, ‘మనం’, ‘దృశ్యం’ లాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథ కావాలని చిరంజీవి సూచించినట్లుగా చెప్పుకుంటున్నారు తెలుగు సినీ పరిశ్రమలో.
చిరంజీవి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, తమ అభిమాన హీరో రీ`ఎంట్రీ ఇచ్చే సినిమా చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. అభిమానుల కోరిక నెరవేర్చడంతోపాటుగా కమర్షియల్ సక్సెస్ సాధించి, తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న చిరంజీవి కొన్ని రోజులలోనే చేయబోయే కొత్త సినిమాని ప్రకటిస్తారని సమాచారమ్.
|