అజాగ్రత్త, భద్రతా వ్యవస్థ లోపం, చిన్నారుల ప్రాణాలను చిదిమేసింది. మాసాయిపేట రైల్వే క్రాసింగు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో విగత జీవులైన పసి మొగ్గలను చూసి ఎలా తట్టుకోగలం? ఆ తల్లిదండ్రుల గర్భశోకానికెవరు బాధ్యత వహించగలరు? ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే గుర్తొచ్చే భద్రతాప్రమాణాలు ఎల్లవేళలా నిక్కచ్చిగా పాటిస్తే ఇలాంటి ఘోరాలు చాలావరకు అరికట్టవచ్చు. స్కూలుకెళతామని బయల్దేరి, తిరిగిరాని లోకాలకెళ్ళిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం.
***
చూడచక్కని బొమ్మలు, కార్టూన్లతో బాటు పత్రికాలంకరణలో కీలక భూమిక పోషించిన ప్రముఖ చిత్రకారులు శ్రీ మాధవ్ గారు చిన్న విరామం తర్వాత పున:ప్రవేశం చెయ్యడం సంతోషదాయకం. రాబోయే సంచికలు మరింత వర్ణశోభితం కానున్నాయని తెలియజేస్తూ..
మీ
బన్ను
|