‘లెజెండ్’ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చారు బాలకృష్ణ. ‘మనం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగార్జున. తానేం తక్కువ తిన్లేదని ‘దృశ్యం’తో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు వెంకటేష్. మిగిలిందల్లా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలని ఈ నలుగురు హీరోల గురించి చెబుతారు ప్రముఖంగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత.రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత సినిమాలు చేయని చిరంజీవి తన 150వ సినిమా చేయాలనే కసితో ఉన్నారు ఇప్పుడు. అందుకనే వినాయక్ని పిలిపించుకుని మంచి కథ రెడీ చేయమని చెప్పారట కూడా. చరణ్ నిర్మించబోతున్నాడు చిరంజీవి 150వ సినిమాని. కథ గురించిన కసరత్తులు చేస్తున్న వినాయక్, ‘అన్నయ్యతో సినిమా చేస్తున్నాను’ అని చెప్పారు కూడా. వినాయక్, ఇదివరకు చిరంజీవితో ‘ఠాగూర్’ సినిమా చేసి హిట్ కొట్టాడు.అందుకనే వినాయక్, చిరంజీవితో చేసే కొత్త సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు సినిమా పరిశ్రమలో. త్వరగా సెట్స్పైకి సినిమా వస్తే తప్ప చిరంజీవి సినిమా చేస్తారా? లేదా? అనే సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. సినిమా చేసి హిట్ కొట్టేస్తే, నలుగురు ‘టాప్’ హీరోలూ ఫామ్లోకి వచ్చినట్లవుతుంది.
|