పద్మశ్రీ బాపు గారు మరిక మన మధ్య లేరన్న వాస్తవం బాధిస్తున్నా, వారి అద్భుత, అపురూప కళా సృష్టి మాత్రం ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుందన్నది సత్యం. గోతెలుగు.కాం లోగో డిజైన్, ప్రారంభ సంచిక ముఖ చిత్రం, వారి చేతులమీదుగా రూపుదిద్దుకుంది. అయితే మరొక విశేషమేమిటంటే వారు అచ్చులో అనేక పత్రికలకు ముఖచిత్రాలు గీసారు కానీ, వారు గీసిన లోగో డిజైన్ మరియు ముఖచిత్రం తో ప్రారంభమైన అరుదైన అదృష్టం గోతెలుగు వెబ్ మాగజైన్ కి మాత్రమే దక్కింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ...
మీ
బన్ను
|