కన్నడ హీరోయిన్ రమ్య మళ్ళీ వస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్రామ్తో ‘అభిమన్యు’ సినిమాలోనూ, శర్వానంద్తో ‘అమృతవర్షం’ అనే సినిమాలోనూ రమ్య నటించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ కూడా అయిన రమ్య, తక్కువ కాలంలోనే ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. గత ఎన్నికలలో ఓడిపోయిన రమ్య, రాజకీయాలపట్ల నిర్వేదం చెంది, ఇకపై సినిమాలకే పరిమితవ్వాలని నిర్ణయించుకుంది.
పిన్న వయసులో ఎంపీ అయినప్పటికీ, రాజకీయాల్లో తాను ఇమడలేననే నిర్ణయానికి వచ్చింది రమ్య. అందుకు కారణమైన పరిస్థితులు ఏమైనాగానీ, ఆమె సినిమాల్లో కొనసాగాలనే ఆలోచనతో కొన్ని సినిమాలు చేయడానికీ ఒప్పుకుంది. ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
అయితే కొన్ని రోజులుగా రమ్య విదేశాలకు వెళ్ళడంతో, ఆమె తీవ్ర నైరాశ్యంతో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండిరచిన రమ్య, అమెరికాలో తాను ఉన్నాననీ, కొన్ని రోజులు కుటుంబ సభ్యులతో గడిపి, ఆ తర్వాత ఇండియాకి వచ్చి సినిమాల్లో కొనసాగుతానని చెప్పింది. సినిమాల్లో తన స్థానం పదిలంగా ఉందని చెబుతూ, గ్లామరస్ కనిపించడం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటానని వెల్లడిరచింది. రమ్య మళ్ళీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|