కావలిసిన పదార్ధాలు:
పీతలు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కరివేపాకు
నూనె
ఉప్పు
కారం
పసుపు
కొత్తిమీర
మసాలా ముద్ద ( లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క)
తయారుచేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ముద్దగా చేయాలి. తరువాత బాణలిలో నూనె వేసి అందులో ముద్దగా చేసిన మిశ్రమాన్ని వేసి బాగా వేగనివ్వాలి. ఈ మిశ్రమం బగారు రంగు వచ్చేవరకు వేగనిచ్చి తరువాత పీతలను వేసి 10 నిముషాలు మూత పెట్టి వుంచాలి. తరువాత ఆవిరికి కొంత నీరు తేలుతుంది. అవి ఉడకడానికి కొంచెం నీరు పోయాలి. తరువాత మసాలా ముద్దను వేసి బాగా కలపి మూత పెట్టాలి. 10 నిముషాలయ్యాక మూత తీసి కొత్తిమీర వేయాలి.
వేడి వేడి పీతల ఇగురు రెడీ....
|