సినీ రంగంలో తాము సంపాదించుకున్న పాపులారిటీని క్యాష్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆ పాపులారిటీని పొందిన తాము అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మంచి ‘మెసేజ్’ ఇవ్వాలని కూడా చూస్తుంటారు. సెలబ్రిటీలు సామాన్యులకి మార్గదర్శకులుగా ఉండాలి. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే తమను ప్రేక్షకులు ఇంకా గౌరవిస్తారని అంటున్నారు సెలబ్రిటీలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్న హిందీ, తెలుగు, తమిళ ఇతర భాషల సినీ సెలబ్రిటీలు, ఇలా వచ్చి అలా ఊడ్చి వెళ్ళిపోవడం కాకుండా, తమ అభిమానులూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ఫొటోలకు పరిమితమయ్యేవారూ ఉన్నా, కమిట్మెంట్తో వస్తున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది.
హీరోలు స్వచ్ఛ భారత్లో విరివిగా పాల్గొంటున్నా, వారికంటే కూడా హీరోయిన్లు స్వచ్ఛ భారత్కి కొత్త గ్లామర్ అద్దుతున్నారు. ఫలాన చోట స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తామని కొందరు చెప్పి చేస్తుంటే, ఇంకొంతమంది చెప్పకుండా పని పూర్తి చేసి, ఆ తర్వాత ఆ వివరాల్ని మీడియా ముందుంచుతున్నారు. త్రిష కూడా ఇటీవలే చెన్నయ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించింది. మంచి కార్యక్రమం కోసం మంచి మనసుతో వచ్చేవారిని అభినందిద్దాం.
|