2014 మొత్తానికి ఏ హీరోయిన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ చర్చ జరిగింది? అంటే రకుల్ ప్రీత్సింగ్ అని చెప్పాలి. సమంత, శృతిహాసన్, తమన్నా లాంటి అందగత్తెలు రేస్లో ఉన్నప్పటికీ, వారి రేంజ్కి ఎదగకున్నా అందరి దృష్టినీ ఆకర్షించింది రకుల్ ప్రీత్ సింగ్.
‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో వచ్చిన గుర్తింపు, తద్వారా వచ్చిన అవకాశాల్ని రకుల్ ప్రీత్ సింగ్ సద్వినియోగం చేసుకుంది. గోపీచంద్తో ఆమె చేసిన ‘లక్ష్యం’ విజయవంతమవడంతో రకుల్ ప్రీత్ సింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ‘కరెంట్ తీగ’, ‘రఫ్’ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలతో ఆమె ఇమేజ్కి ఇబ్బంది రాలేదు.
2014లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుని, హీరోయిన్గా తెలుగులో ఇంకా ఎత్తుకు ఎదుగుతాననే ధీమాతో ఉందీ ముంబై భామ. టాలీవుడ్ నిర్వహించిన ‘మేముసైతం’లో మిగతా హీరోయిన్లకన్నా రకుల్ ప్రీత్సింగ్ చేసిన సందడే ఎక్కువ. అలా 2014లో రకుల్ ప్రీత్సంగ్ని సత్తా చాటిన ఎక్స్ప్రెస్ బ్యూటీ అని పిలుస్తున్నారు
|