డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 7, 8, 9 తేదీలలో జాతీయ స్థాయి నాటికల పోటీలు అత్యంత వైభవంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరగనున్నాయి. స్థానిక బొండాడ వెంకట్రాజు గుప్త మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నాటికల పోటీలు జరగనున్నాయని సంస్థ గౌరవాధ్యక్షుడు విన్నకోట వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు (చౌదరి), కార్యదర్శి కె.వి. కృష్ణవర్మ తెలిపారు.
ఈ నాటకోత్సవాలకు ప్రాథమిక పరిశీలనలో ఎంపికైన ప్రతి నాటికకూ 9 వేలు ప్రదర్శనా పారితోషికం ఇవ్వబడుతుంది. ఉత్తమ ప్రదర్శనకు 12 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు 11 వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు 10 వేలు, ఉత్తమ రచనకు వెయ్యి రూపాయలు నగదు బహుమతులతోపాటు వ్యక్తిగత బహుమతులకు మెమొంటోలు బహుకరించబడతాయని సంస్థ ఉపాధ్యక్షులు కెఎస్పిఎస్ వర్మ ప్రకటించారు.వివరములకు మానాపురం సత్యనారాయణ, డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్, జర్నలిస్ట్ కాలనీ, హెడ్ పోస్టాఫీస్ ఎదురుగా, పాలకొల్లు 534260, సెల్ నెంబర్ 944217038 చిరునామాలో సంప్రదించాల్సివుంటుందని నిర్వాహకులు కోరుతున్నారు.
|