Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
saahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సభకు నమస్కారం - .

 

భగవాన్ శ్రీసత్యసాయిబాబావారి ఆశీస్సులతో స్వాత్వసంత్ర్యసమరయోధులు కొమరగిరి కృష్ణమోహన రావుగారు మచిలీపట్నం లో 30 సం.క్రితం  స్థాపించిన ' శ్రీవాణి ' అనే సాంస్కృతిక, ఆధ్యాత్మిక మాస పత్రికను ఆయన 5సం.క్రితం స్వర్గస్తులయ్యాక వారి సతీమణి శ్రీమతి.జయప్రదగారు సంపాదకత్వం వహించి కుమారులు చంద్రశేఖర్, శ్యాం ప్రసాద్ , ఉదయ్ ల సహకారంతో 30.వసంతాల పండుగను మచిలీపట్నంలో ఈ జనవరి 11న నిర్వహించారు.54మంది రచయితలతో శ్రీవాణి సాయిదర్బార్ ' నిర్వహించి  శ్రీవాణిలో వ్రాస్తున్న రచయితలనూ, రచయిత్రులనూ అందరినీ సత్కరించారు. ఆసందర్భంగా ఆదూరి.శ్రీనివాసరావుగారు రచించిన ' హృదయవీణ ' అనే బాబావారిని ప్రస్తుతిస్తూ   పాటలు, పద్యాల పుస్తకాన్ని శ్రీమతి జయప్రదగారు ఆవిష్కరించారు.  ఆసభలో శ్రీ అనిల్ కుమార్ గారు [విశ్రాంత  అధ్యాపకులు], వి.ఎస్.ఆర్. మూర్తిగారు, జయప్రదగారు, ఆదూరి హైమవతి, పుస్తకరచయిత ఆదూరి.శ్రీనివాసరావుగారు[విశ్రాంత  అధ్యాపకులు], మరియు ఇతర రచయితలు.

మరిన్ని శీర్షికలు
kaakoolu