‘దృశ్యం’ సినిమాకి ముందు కొన్ని ఫ్లాప్స్ చూసిన వెంకటేష్లో చాలా మార్పు కన్పిస్తోంది ఇప్పుడు ‘గోపాల గోపాల’ సినిమాతో లేటెస్ట్గా హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్, కథల ఎంపికలో వెంకటేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, కెరీర్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడట.
కుటుంబ చిత్రాల దర్శకుడు దశరద్ ఓ లైన్ చెప్పగా, అది తనకు నచ్చేయడంతో దశరధ్తో సినిమా చేయడానికి వెంకీ కమిట్ అయ్యాడని తెలుస్తుంది. ఇది కాకుండా ఓ తమిళ దర్శకుడు చెప్పిన థ్రిల్లర్ కథాంశంపైనా వెంకటేష్ ఆసక్తి చూపుతున్నాడట. ‘దృశ్యం’ ఆ జోనర్లో వచ్చిందే. ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించడంతో వెంకటేష్కి ఓ ప్రత్యేకత ఉంది. అందుకనే ఫ్యామిలీ సినిమా చేస్తూ, ఆ టచ్ వున్న థ్రిల్లర్ సినిమాల్ని వెంకీ సెలక్ట్ చేసుకుంటున్నాడు. నేల విడిచి సాము చేసే పాత్రల్ని వెంకటేష్ ఇకపై చేసే అవకాశం లేదంటున్నారు. కొత్త తరహా కథల్ని, ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమాల్ని ప్రేక్షకులు ఇష్టపడ్తుండడంతో, వారి అభిరుచికి తగ్గట్లే సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్న వెంకటేష్, వరుస విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
|