మోహన్బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకి ‘దొంగాట’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సినిమాలో అడవి శేష్, మంచు లక్ష్మికి జంటగా నటిస్తున్నాడు. వంశీ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా టైటిల్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మంచు ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బ్యానర్పై మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సినిమాని మలుపు తిప్పే పాత్రలో ప్రముఖ హీరో రాణా కనిపిస్తాడట. రాణా అయితేనే ఆ పాత్రకు సరిపోతాడని భావించిన మంచు లక్ష్మి, రాణాతో సంప్రదింపులు జరిపి, అతన్ని ఒప్పించారని కూడా తెలుస్తోంది. ప్రధాన సన్నివేశాల షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఎంటర్టైన్మెంట్తో కూడిన చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో ఈ సినిమా ఆ జోనర్లోనే రూపొందించారట. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనీ, కొత్త కథ, కొత్త తరహా కథనంతో సినిమాని దర్శకుడు చాలా బాగా తెరకెక్కిస్తున్నాడంటున్నారు. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. నటనలో భిన్నత్వం చూపే మంచు లక్ష్మి, నిర్మాతగానూ అభిరుచితో కూడిన సినిమాలో రూపొందిస్తున్నారు. ఎప్పుడో జగపతిబాబు, సౌందర్య జంటగా ‘దొంగాట’ అనే సినిమా వచ్చింది. ఆ కథకీ ఈ కథకీ పోలిక ఉండదుగానీ, తన సినిమాకి ‘దొంగాట’ అనే టైటిల్ అయితేనే బావుంటుందని భావించి, మంచు లక్ష్మి ఈ పేరుని ఖరారు చేశారట.
|