ఈ తరం హీరోయిన్లలో కళ్ళతోనే భావాలు పలికించగల హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా గుర్తుకు వచ్చే హీరోయిన్ నిత్యా మీనన్. మలయాళ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిత్యామీనన్, ఏ సినిమాలో నటించినా, తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ, సక్సెస్లతో దూసుకుపోతోంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నిత్యామీనన్ కనిపించనుంది. ఆ పాత్రలో నటనకు చాలా స్కోప్ ఉందని, అందుకే పాత్రను ఒప్పుకున్నట్లు నిత్యా మీనన్ చెప్పింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించడం అంటే నిత్యా మీనన్ ప్రమోషన్ పొందినట్లే.అయితే ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో హీరో అల్లు అర్జున్కి చెల్లెలిగా నిత్యా మీనన్ నటిస్తోంది. కథకు అత్యంత ప్రాముఖ్యమైనదట ఆమె పాత్ర. పాత్ర స్వభావం నచ్చడం వల్ల ఇంకో ఆలోచన చేయకుండా ఒప్పుకున్నట్లు నిత్యామీనన్ చెప్పింది. ఎందరో హీరోయిన్లు చెల్లెలి పాత్రల్లో కనిపించారు గనుక, తాను అలాంటి పాత్ర చేయడానికి మొహమాటపడలేదని, సంశయించలేదని అంటుంది నిత్యామీనన్.
|