బాలీవుడ్లో ‘సైకో’ అనే సినిమా ఒకటి తెరకెక్కుతోంది. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఈ చిత్రానికి నిర్మాత. కిషోర్ భార్గవ దర్శకుడు. హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తారు. తొలుత ఈ సినిమాని మే 31న విడుదల చేయాలనుకున్నారు. అయితే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాల్సి వుండడంతో, సినిమాని జూన్ మూడో వారానికి పోస్ట్పోన్ చేశారు.
‘సైకో’ కథాంశంతో చాలా సినిమాలొచ్చినా, వాటన్నిటిలోకీ ఇది చాలా డిఫరెంట్గా వుంటుందట. ఓ అమ్మాయి వెంట పడి ఓ వ్యక్తి వేధిస్తాడనీ.. ఆ వేధింపులు ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్తుందనీ, ఎలాగోలా ఆ గండం నుంచి బయటపడ్డ ఆ యువతి, ప్రతీకారం ఎలా తీర్చుకుంది? అనేదే సినిమా కథాంశమట.
చాలా అద్భుతంగా సినిమా వచ్చిందని సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్ల మాటల్ని బట్టి అర్థమవుతోంది. వర్మ నిర్మాణంలో, దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. రిజల్ట్ ఎలా వున్నా, ఆ సినిమాలకంటూ ఓ ప్రత్యేకత వుంది. ‘సైకో’ సినిమా కూడా ఆ కోవలోనే వుంటుందని వేరే చెప్పక్కర్లేదు.
|