Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Madhura Sridhar in Searching of Sperm Donar

ఈ సంచికలో >> సినిమా >>

ద్విశతావధానంలో సినీ సందడి?

Celebrities at Double Satavadhanam

శతావధాని మాడుగుల నాగఫణిశర్మ, అవధానం చేసేటప్పుడు ఫ్రుచ్ఛకులుగా సినీ ప్రముఖులు హాజరవుతుంటారు. 1992లో రవీంద్రభారతిలో ద్విశతావధానం జరిగింది. ఆ కార్యక్రమంలో ఫ్రుచ్ఛకుడిగా తనికెళ్ళ భరణి వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తనికెళ్ళ భరణికి భాషపై వున్న పట్టు వున్న విషయం తెల్సినదే.

1996లో మాడుగుల నాగఫణిశర్మ సహస్రావధానం చేయగా ఆ కార్యక్రమానికి బాబూమోహన్‌, ఏవీఎస్‌ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఫ్రుచ్ఛకులు వేసే ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు చెప్తారు శతావధానాలు, ద్విశతావధానాల్లో మాడుగుల నాగఫణిశర్మ. పంచ శతావధానం 2003లో జరుగగా దాంట్లోనూ పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.

చాలా గ్యాప్‌ తర్వాత ఈ నెల 30 నుంచి 3వ తేదీ వరకు అవధాన సరస్వతీ పీఠంలో ద్విశతావధానం చేయబోతున్నారు మాడుగుల నాగ ఫణిశర్మ. ఈ కార్యక్రమానికీ సినీ ప్రముఖులైన పలువురు పెద్ద సంఖ్యలో హాజరవుతారని సమాచారం. దాదాపు పదేళ్ళ విరామం అనంతరం చేస్తున్న అవధాన కార్యక్రమం కావడంతో ఈ కార్యక్రమంపై సామాన్యుల్లోనూ ఆసక్తి బాగా వుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Multi Talented Director