బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ సరసన హీరోయిన్గా నటించిన కృతి సనన్ తెలుగులో మహేష్ హీరోగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, ఒడ్డూ పొడుతూ అందం నటన అన్నీ ఉండటంతో కృతి సనన్ తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని బాగానే ఆకర్షించింది. నాగచైతన్యతో ‘దోచెయ్’ సినిమాలో నటించిన కృతి, ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించాలని ఉందని చెబుతూ, ఇప్పటివరకూ తనపై గాసిప్స్ రాకపోవడం గొప్ప విషయమనీ, బాలీవుడ్లో కొన్ని గాసిప్స్ వచ్చినా కెరీర్లో అవీ ఓ భాగంగానే తాను భావిస్తున్నట్లు వెల్లడిరచింది కృతి సనన్. నాలో తప్పొప్పుల గురించి తగిన సూచనలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తానని కృతి చెబుతుంది. బాలీవుడ్లో షారుక్ఖాన్తో ‘దిల్ వాలే’, మరో సినిమా ‘ఫర్జే’లోనూ నటిస్తూ తెలుగులో కూడా కృతి సనన్ అవకాశాల్ని అందిపుచ్చుకుంటుంది. ఆమె కెరీర్ విజయపథంలో దూసుకెళ్ళాలని కోరుకుందాం.
|