అనసూయ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే అనసూయ.. అన్నంతగా ఈటీవీలో వచ్చే 'జబర్దస్త్' కామెడీ షోకి పాపులారిటీ పెరిగిందన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడా షోలో అనసూయకు బదులు రష్మి గౌతమ్ యాంకర్గా వ్యవహరిస్తోంది. యాంకర్ మారాక ఆ ప్రోగ్రామ్ పాపులారిటీ తగ్గిపోతుందని చాలామంది అనుకున్నారు.
అనసూయతోపాటుగా ఆ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు కొన్ని ఎపిసోడ్లకు దూరమవడంతో ఇక 'జబర్దస్త్' అటకెక్కినట్లేనని వీక్షకులు భావించినప్పటికీ, నాగబాబు మళ్ళీ ప్రత్యక్షమవడం, అనసూయకన్నా రష్మి గౌతమ్ గ్లామరస్గా కన్పించడంతో ముందుకన్నా ఇప్పుడు 'జబర్దస్త్' ప్రోగ్రామ్ పాపులారిటీ పెంచుకుంది.
ఎందుకిలా? అంటే దానికి సమాధానం చెప్పడం కష్టం. యాంకర్ వల్ల ప్రోగ్రామ్ హిట్టవదు.. ఆ యాంకర్ లేకపోతే ప్రోగ్రామ్ అటకెక్కిపోదు. అలాగే అన్ని సందర్భాల్లో ఈ లాజిక్ కరెక్ట్ కాదు. 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ప్రధాన ఆకర్షణ. అతని ఇమేజ్ మీదనే ఆ కార్యక్రమం పాపులర్ అయ్యింది.
ప్రోగ్రామ్లో కంటెంట్ వుండాలి.. ఆ ప్రోగ్రామ్కి హోస్ట్గా వ్యవహరించిన వ్యక్తికీ కంటెంట్ వుండాలి. అప్పుడే ప్రోగ్రామ్కీ, హోస్ట్కీ పాపులారిటీ పెరుగుతుంది.
|