మెగా రాజకుమారుడు వరుణ్ తేజతో మళయాళం బ్యూటీ తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వనుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వరుణ్ తేజ చేయబోతున్న సినిమాలో మల్లూ బ్యూటీ సాయి పల్లవి జత కట్టబోతోందట. 'మళయాళంలో 'ప్రేమమ్' సినిమాతో మంచి పేరు తెచ్చుకుందీ బ్యూటీ. నేచురల్ లుక్స్తో 'ప్రేమమ్' సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును కూడా అందుకుంది. కోలీవుడ్లో తొలి సినిమాతోనే నటనలో ఎంతో పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఆ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిపోయిన శేఖర్ కమ్ముల తన సినిమాలో ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్గా తీసుకోవాలని డిసైడ్ అయిపోయాడట.
మెగా ప్రిన్స్తో తెరకెక్కించే సినిమా ద్వారా కూల్ అండ్ రొమాంటిక్ లవ్స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా పాస్ చేయాలనుకుంటున్నాడట శేఖర్ కమ్ముల. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్స్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా హైలెట్గా డిజైన్ చేశాడట. దాంతో ఎక్స్ప్రెసివ్ ఫీచర్స్తో, సహజ నటనని కనబరిచే అమ్మాయి కోసం చూస్తున్న శేఖర్ కమ్ముల దృష్టిలో సాయిపల్లవి పడిందట. ఇదే కనుక జరిగితే తెలుగులో మెగాప్రిన్స్తో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే రొమాన్స్కి రెఢీ అయినట్లే. తెలుగు తెరకు మెగా ఎంట్రీ ఇవ్వబోతోన్న ఈ ముద్దుగుమ్మ తమిళంలో 'కాళి' అనే సినిమాలో నటిస్తోంది. ఆల్ ది బెస్ట్ సాయి పల్లవి.
|