బ్లాక్ ...(బోర్డ్ ) చిత్ర టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి* ::
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్
పైన
గతంలో ఎందరో మహానుభావులు చిత్రం నిర్మించి విడుదల చేసిన ఈ చిత్ర బృందం మరల ఇదే బ్యానర్ లో నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ని ప్రముఖ నటుడు,రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ
శివరాత్రి పండుగ అంటేనే మనల్ని మనం ఆవిష్కరించుకోవడం. అలానే ఆ మహా శివుడి
దీవెనలతో ఈ బ్లాక్ బోర్డ్ చిత్రం టైటిల్ ని నా ద్వారా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది.
గతంలో ఈ బ్యానర్ లో "ఎందరో మహానుభావులు " చిత్రంలో నేను ముఖ్య పాత్రని పోషించాను.
ఈ చిత్రం కూడా నిర్మాతకు, దర్శకుడికి ,మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను.
ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ
శివరాత్రి పండుగ సందర్భంగా భరణి గారి చేతుల మీదుగా ఇలా టైటిల్ ఆవిష్కరణ జరగడం చాలా శుభ సూచికం.
దర్శకులు సాయి కృష్ణ ,సయ్యద్ మాట్లాడుతూ ఇది ఒక క్రైం , థ్రిల్లర్ జోనర్ సినిమా. రియల్ స్టోరీ ని ములధారణ గా తీసుకొని చేస్తున్న ఈ చిత్రం
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఈ చిత్రానికి తల్లాడ సాయికృష్ణ, శిరీష రావ్, విజయ్ దేశిని ప్రధాన పాత్రలు పోషించగా
నిర్మాత : తల్లాడ శ్రీనివాస్
దర్శకులు : సాయి కృష్ణ, సయ్యద్.
కెమెరా : శివ రాథోడ్
సంగీతం : వి.ఆర్.ఏ ప్రదీప్
ఎడిటింగ్ :రాధా
నేపధ్య సంగీతం : ప్రమోద్
పబ్లిసిటీ డిజైన్స్ : ఆర్.కె, కార్తిక్ .పి ఆర్ ఓ : వి ఆర్ మధు ,
సహా నిర్మాత : సోని ఉద్ధండా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు గా
గౌతమ్, ఉమేష్,చుక్క చందు వ్యవరిస్తున్నారు.
|