నిఖిల్ హీరోగా రూపొందిన 'ముద్ర' సినిమా పేరు మార్చుకుని అర్జున్ సురవరంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి 'ముద్ర' టైటిల్తో నిఖిల్ చాలా ఇంపాక్ట్ చూపించాడు. జగపతిబాబు నటించిన ఓ సినిమా 'ముద్ర' పేరుతో వచ్చి వెళ్లిపోయింది. నిఖిల్ ఫోటోలు పెట్టి ధియేటర్స్ వద్ద అడ్డగోలుగా ఆ సినిమా టిక్కెట్స్ అమ్మేశారు. మార్నింగ్ షోలు హౌస్ఫుల్ కూడా అయ్యాయి. అలా నిఖిల్కి చాలా అన్యాయమే జరిగింది. కానీ ప్రశ్నించే వారేరీ.? ఆ సంగతి పక్కన పెడితే, వ్యవస్థలో లోటు పాట్లను ఎత్తి చూపేందుకు జర్నలిస్టు పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఈ యంగ్ హీరో. జర్నలిస్టుగా గతంలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు కూడా నటించారు. పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా చేశాడు.
కళ్యాణ్రామ్ 'ఇజం' కూడా అలాంటిదే. ఇప్పుడీ 'అర్జున్ సురవరం' కూడా మీడియా నేపథ్యంలో వస్తున్న సినిమానే. మీడియాని కడిగి పారేస్తూనే, మీడియా గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ సినిమా ఉండబోతోందట. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది.
|