హీరో నితిన్ చాలా కాలంగా 'భీష్మ' సినిమాతో కుస్తీ పడుతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు. ఆలస్యానికి చింతిస్తున్నాననీ వీలైనంత త్వరగా గుడ్ న్యూస్ చెబుతాననీ నితిన్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ భామ రష్మికా మండన్నా ఖరారైంది. అన్నీ కుదిరితే ఈ నెలాఖరు లోపు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందట. వరుస ఫ్లాపుల తర్వాత 'ఇష్క్', గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలతో దూసుకొచ్చిన నితిన్ దురదృష్టవశాత్తూ 'లై', శ్రీనివాస కళ్యాణం' తదితర సినిమాలతో ఫెయిల్యూర్స్ చవి చూశాడు. ఈ నేపథ్యంలో ఈ సారి చేసే సినిమాలతో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట నితిన్.
కొంచెం ఆలస్యమైనా ఫర్లేదు, అస్సలేమాత్రం రాజీ పడకూడదు అన్న కోణంలోనే నితిన్ టైం తీసుకుంటున్నాడట. ఒక సినిమా ఖరారైంది. రెండో సినిమా మాటేంటీ.? అది కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాడట. ఈ ఏడాది ఎలాగైనా రెండు సినిమాలతో మెప్పిస్తానంటూ అభిమానులకు భరోసా ఇచ్చాడు. నితిన్ మాట నిలబెట్టుకుంటాడా.? మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా.? వేచి చూడాల్సిందే.
|