స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్గా తెరకెక్కిన 'కథానాయకుడు', మహానాయకుడు' చిత్రాలు వరుస ఫ్లాప్లుగా తేలడంతో ఇక అందరి దృష్టీ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పైనే ఉంది. ఈ సినిమా ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. అందులో భాగంగా లేటెస్ట్గా విడుదలైన 'అవసరం' సాంగ్ అందర్నీ ఆలోచింపచేస్తోంది. ప్రముఖ పాటల రచయిత సిరాశ్రీ కలం నుండి జాలువారిన ఈ సాంగ్లోని లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. లిరిక్స్కి తగ్గట్లుగా కళ్యాణీ మాలిక్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. వుమెన్స్ డే సందర్భంగా వర్మ తన ట్విట్టర్ ద్వారా లేటెస్ట్గా ఈ సాంగ్ని ప్రోమోని విడుదల చేశారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్కి వ్యూస్ పోటెత్తాయి. మొదటి గంటలోనే లక్ష వ్యూస్ దాటేసింది 'అవసరం' సాంగ్. ఇక ఈ సాంగ్ ప్రోమో చూసి అభిమానులు వర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దటీజ్ వర్మ.. అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. వర్మ అవరసరం సినీ ఇండస్ట్రీకి ఉందని కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు ఈ సాంగ్ విన్నాక వర్మ అవసరం వైఎస్సార్సీపీకి ఎక్కువగా ఉందంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాల్ని మరింత రెట్టింపు చేశాడు రామ్గోపాల్ వర్మ.
|