Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌' టాక్‌: అవార్డులిచ్చి హౌస్‌లో పుల్లలు పెట్టేశారు.!

big talk

గత వారం కాస్త డల్‌గా సాగిన బిగ్‌బాస్‌ 3, వీకెండ్‌లో నాగార్జున రాకతో జోరందుకుంది. తామెలా ఉన్నామో అలా ఉండమంటే, స్క్రిప్టెడ్‌గా బిగ్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు నటిస్తున్నారంటూ బయట వినిపిస్తున్న టాక్‌తో, ఈ వారం హౌస్‌మేట్స్‌కి ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చాడు నాగార్జున. ముసుగులు తీసేయమన్నాడు. వారిలోని రియాల్టీని బయటికి తీసుకురమ్మన్నాడు. అలా వారికి కొన్ని ఫన్నీ అవార్డులు కూడా ఇచ్చాడు. దాంతో ఈ వీకెండ్‌ అంతా ఫన్నీగా నడించింది. వీకెండ్‌లో ఫన్‌ సంగతి సరే కానీ, ఫన్నీగా ఇచ్చిన అవార్డులు కాస్తా హౌస్‌లో గొడవలకు దారి తీశాయి. ముఖ్యంగా అలీ, మహేష్‌ మధ్య పెద్ద వార్‌ నడిచింది. మహేష్‌కి బిగ్‌బాస్‌ అగ్గిపుల్ల అవార్డునిచ్చాడు. అందరి మధ్యనా పుల్లలు పెడుతున్నాడనే అర్ధం వచ్చేలా ఈ అవార్డు ఇచ్చాడు.

ఇది పట్టుకుని హౌస్‌లో వేరే సిట్యువేషన్‌ని బేస్‌ చేసుకుని, అలీ రైజా, 'పుల్లలు పెడుతున్నావ్‌.. దెబ్బలు తింటావ్‌రా మహేషా..' అంటూ గొడవకు దిగాడు. ఇలా మాస్క్‌లు తీసేయమని నాగార్జున చెప్పిన మాట హౌస్‌లో మరోలా కన్‌వే అయ్యింది. బాబా భాస్కర్‌, అషూ రెడ్డి కూడా వింతగా ప్రవర్తించారు హౌస్‌లో. సిల్లీ రీజన్స్‌తో పాపం రాహుల్‌ని, హౌస్‌లో అత్యధిక మెజార్టీ కంటెస్టెంట్లు నామినేషన్‌ చేశారు. మాస్క్‌లు తీసేయమంటే, ఇలా ఉన్న మాస్క్‌లు తీసేసి, కొత్త మాస్క్‌లు ధరించి, రచ్చ రచ్చ చేస్తున్నారు హౌస్‌ మేట్స్‌. ఎలిమినేషన్‌ ప్రక్రియలో, బాబా భాస్కర్‌ - అలీ, పునర్నవి, ఆషూ, హిమజ తదితరుల మధ్య ఓ చిన్నపాటి బాహుబలి వార్‌ నడిచింది. వితిక, శివజ్యోతిలు కెప్టెన్సీ టాస్క్‌ కోసం పోటీ పడగా, ఓర్పుతో శివజ్యోతి కెప్టెన్సీ దక్కించుకుంది. ఇలా ఈ ఈ వారం బిగ్‌బాస్‌లో పలు ఆశక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. వీటిని బేస్‌ చేసుకుని, వచ్చే వారం హోస్ట్‌ నాగార్జున వారికి ఎలాంటి మందలింపు చర్యలు చేపడతాడో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
'Saira Narasimhareddy' to make history