జాతీయ అవార్డు గ్రహీత హన్సల్ మెహతా, తెలుగు హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్కి అవకాశం ఇచ్చాడు. వ్యభిచారం కేసులో శ్వేతా బసు ప్రసాద్ అరెస్ట్ అవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడాయన. ఆమె రెస్క్యూహోమ్లో ఉన్నప్పుడే నటిగా ఆమెను ప్రోత్సహించవలసి ఉందని, ఆమెను ఆ కేసులో ఇరికించిన వారిపట్ల చూపాల్సిన వ్యతిరేకత ఆమెపై మీడియా ఎందుకు చూపిస్తోందో తనకు అర్థం కావడంలేదని చెబుతూ శ్వేతా బసు ప్రసాద్కి అవకాశం ఇస్తానన్నాడాయన.
అన్న మాట నిలబెట్టుకుని తను తీస్తున్న డాక్యుమెంటరీలో శ్వేత బసుకి అవకాశం ఇచ్చాడు హన్సల్ మెహతా. దిల్ రాజు నిర్మించిన ‘కొత్త బంగారు లోకం’ సినిమా ద్వారా హీరోయిన్గా ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, ఆ చిత్రంతో ప్రేక్షకుల మన్ననలు పొందింది, హీరోయిన్గా ఇండస్ట్రీ పెద్దల నుంచీ ప్రశంసలు అందుకుంది. దురదృష్టవశాత్తూ ఆమె ఊహించినట్లుగా కెరీర్ ముందుకు సాగలేదు.
కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ శ్వేతా బసు ప్రసాద్ తొలి చిత్రాన్ని మించిన విజయం దక్కించుకోలేకపోగా, పరాజయాలే ఆమెను పలకరించాయి. దురదృష్టవశాత్తూ వ్యభిచారం కేసులో అరెస్టవడంతో సినిమా కెరీర్ కూడా అయోమయంలో పడిరది. హన్సల్ మెహతా ఇచ్చిన ఛాన్స్తో మళ్ళీ ముఖానికి రంగేసుకోనున్న శ్వేత, తిరిగి సినిమా కెరీరోలో విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.
|