మెగాస్టార్ చిరంజీవి చేయబోయే 150వ సినిమాకి దర్శకుడు ఎవరన్న ప్రశ్నకు సమాధానమే దొరకడంలేదు. ఆప్షన్స్ ఉన్నా కొత్త ఆప్షన్స్ తెరపైకొస్తున్నాయి. ఎప్పటినుంచో వినాయక్ పేరు వినిపించినప్పటికీ వినాయక్ వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. 'ఐ' సినిమా రిలీజ్కి ముందు శంకర్తో చిరంజీవి సినిమా చేయవచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. తాజా కథనాల ప్రకారం చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి చేయబోయే సినిమాకి దర్శకుడు కావొచ్చు. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా విడుదలయ్యాక చిరంజీవితో సినిమాపై అనౌన్స్మెంట్ వస్తుందని సమాచారమ్. అయితే ఇంకొందరు దర్శకుల పేర్లూ చిరంజీవి చేయబోయే సినిమా గురించి వినిపిస్తున్నాయి. కథ ఎంపిక దగ్గరే చిరంజీవి ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారట. కథ ఒక్కసారి ఫైనల్ అయితే డైరెక్టర్ విషయం కూడా వెంటనే స్పష్టత రానున్నదట. చిరంజీవి తనయుడు రామ్చరణ్ ఈ చిత్రానికి నిర్మాత. పూరి జగన్నాథ్ కూడా ఇప్పటికే చిరంజీవికి ఓ కథ అందించాడని సినీ వర్గాల్లో గాసిప్స్ గుప్పుగుప్పున సంచరిస్తున్నాయి.
|