రచయితగా ఎన్నో సినిమాలు చేసి దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకత్వంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అది కూడా అతి తక్కువ సినిమాలతోనే. తెలుగు సినిమా అగ్ర దర్శకుల్లో ఒకడిగా త్రివిక్రమ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.పవన్కళ్యాణ్తో చేసిన ‘అత్తారింటికి దారేది’ తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం. కమర్షియల్ విజయం పక్కన పెట్టినట్లయితే, కుటుంబ కథా చిత్రం తీసి, మంచి మెసేజ్ కూడా ఇచ్చి, ప్రేక్షకుల్ని మెప్పించాడంటే, అతనిలోని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.త్రివిక్రమ్ తాజా చిత్రం కూడా ‘విలవలతో కూడిన సినిమా’ కావడం చెప్పుకోదగ్గ విషయం. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ చేస్తున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాకి ‘విలువలే ఆస్తి’ అనే ట్యాగ్లైన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే సినిమాలోని హీరో పాత్ర ఉంటుందని ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది. సరదా సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, కదిలించే సెంటిమెంట్ సీన్స్ ఇలా అన్నీ కలగలిసి అందరూ చూడదగ్గ చిత్రంగా త్రివిక్రమ్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాని తెరకెక్కించారు. ఈ సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఇచ్చే మెసేజ్ ఏమిటో, ఆ సినిమా సాధించే విజయం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
|