దాదాపు ఎనిమిదేళ్ళ అభిమానుల ఎదురు చూపులకు డబుల్ ధమాకాతో వారిని ఉత్సాహపరచనున్నారట మెగాస్టార్ చిరంజీవి. పూరి జగన్నాథ్తో 150వ సినిమా చేయనున్న చిరంజీవి, ఆ వెంటనే ఇంకో సినిమా చేస్తారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 150వ సినిమా వినాయక్తోనే చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో అది వీలుపడలేదు. చిరంజీవిని మనసారా అన్నయ్యా అని పిలిచే వినాయక్, చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఠాగూర్’ సినిమాకి దర్శకుడు. ఆ అభిమానంతోనే 150వ సినిమా చేయాలనుకున్నా వీలుపడకపోవడంతో, 151వ సినిమా వినాయక్తోనే చేయాలని చిరంజీవి నిర్ణయానికి వచ్చాడట. పూరి సినిమా తర్వాత వినాయక్తో చిరంజీవి సినిమా చేయనున్నట్లు సమాచారమ్ అందుతుంది. అయితే పరుచూరి బ్రదర్స్ ఇదివరకే ప్రిపేర్ చేసిన కథతో వినాయక్ దర్శకుడిగా చిరంజీవి సినిమా చేస్తారా? లేదంటే చిన్నికృష్ణ కథతో చిరంజీవి, వినాయక్ కాంబినేషన్లో సినిమా వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకవలసి ఉంది. చిరంజీవి పుట్టినరోజునాడు అన్ని విషయాలపై స్పష్టత ఇవ్వనున్నారట. బ్యాక్ టు బ్యాక్ మెగాస్టార్ డబుల్ ధమాకా ఇస్తే అభిమానులకి పండగే కదా.
|