Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naapaata

ఈ సంచికలో >> సినిమా >>

కొడుకులకు పోటీ కానంటున్న నాగార్జున

nagarjuna
నాగార్జున డ్యూయల్‌ రోల్‌లో వస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. సినిమా దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. షూటింగ్‌ పూర్తయ్యినప్పటికీ కూడా నాగ్‌ ఈ సినిమాను అప్పుడే విడుదల చేయనంటున్నాడట. కారణం ఏమిటంటే కొడుకులు అఖిల్‌, నాగ చైతన్యల సినిమాలు కూడా బరిలో ఉండడమే. అఖిల్‌ హీరోగా వస్తున్న 'అఖిల్‌' సినిమా దసరా కానుకగా అక్టోబరులో విడుదల కానుంది. ఇకపోతే నాగచైతన్య హీరోగా వస్తున్న 'సాహసమే ఊపిరిగా సాగిపో' సినిమా కూడా షూటింగ్‌ పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమైంది.

అందుకే నాగ్‌ తన సినిమాను డిశంబర్‌కు పోస్ట్‌పోన్‌ చేసకున్నాడని ఇండస్ట్రీ టాక్‌. గత సంవత్సరం ఫ్యామిలీ మొత్తం ఒకే సినిమాలో కనిపించి కంబైండ్‌ హిట్‌నందుకుని అభిమానులను అలరించారు. ఈ ఏడాది ముగ్గురూ మూడు సినిమాల్లో నటిస్తూ అభిమానులకు ట్రిపుల్‌ ధమాకా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. చిన్న కుమారుడు అఖిల్‌ నటిస్తున్న 'అఖిల్‌' సినిమా గురించి నాగార్జున చెబుతూ సినిమాలో అఖిల్‌ ఫైట్స్‌ కన్నా డాన్సులు బాగా చేశాడని అన్నారు. అంటే డాన్సుల్లో నాగార్జునకు కొడుకు అఖిల్‌ నుంచి గట్టి పోటీనే ఉంటుందని అర్థం చేసుకోవాలి. 
మరిన్ని సినిమా కబుర్లు
rocket